మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ55
- April 21, 2023
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ను ప్రయోగించనుంది. దీనిద్వారా సింగపూర్కు చెందిన 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు 16 కిలోల బరువున్న లుమొలైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది.
దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం 11.49 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. మొత్తం 25.30 గంటలపాటు కౌంట్డౌన్ కొనసాగనుంది. దీని రిహార్సల్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్లో భాగంగా రాకెట్ను మొబైల్ సర్వీసు టవర్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. కాగా, ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తికాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేయడంతో రికార్డు నెలకొల్పనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









