మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ55
- April 21, 2023
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ను ప్రయోగించనుంది. దీనిద్వారా సింగపూర్కు చెందిన 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు 16 కిలోల బరువున్న లుమొలైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది.
దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం 11.49 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. మొత్తం 25.30 గంటలపాటు కౌంట్డౌన్ కొనసాగనుంది. దీని రిహార్సల్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్లో భాగంగా రాకెట్ను మొబైల్ సర్వీసు టవర్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. కాగా, ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తికాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేయడంతో రికార్డు నెలకొల్పనుంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







