ఖోర్ ఫక్కన్‌లో బోటు ప్రమాదం.. భారతీయ ప్రవాసుడు మృతి

- April 25, 2023 , by Maagulf
ఖోర్ ఫక్కన్‌లో బోటు ప్రమాదం.. భారతీయ ప్రవాసుడు మృతి

యూఏఈ: ఆదివారం ఖోర్ ఫక్కన్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో షార్జాకు చెందిన భారతీయ ప్రవాసుడు మరణించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా మరో ముగ్గురు గాయపడినట్లు షార్జా పోలీసులు ధృవీకరించారు. కాగా, ఏడేళ్ల భారతీయ జాతీయురాలైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స  కొనసాగుతోందని, ఇతరులు డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలిపారు.  38 ఏళ్ల అభిలాష్ సుదీర్ఘ ఈద్ వారాంతంలో ఖోర్ ఫక్కన్ బీచ్‌లో తన సహచరులతో కలిసి బోటింగ్‌కు వెళ్లాడు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 16 మంది ప్రయాణికులు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతం అభిలాష్ మృతదేహాన్ని ఖోర్ ఫక్కన్ ఆసుపత్రి నుండి ఫుజైరా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పేపర్ వర్క్ పూర్తిచేసి మృతదేహాన్ని మంగళవారం లేదా బుధవారం నాటికి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నట్లు సామాజిక కార్యకర్తలు చెప్పారు. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అభిలాష్ షార్జాలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com