కువైట్ లో నివసిస్తున్న భారతీయులు నిబంధనలను పాటించండి
- May 09, 2016కువైట్ లో నివసిస్తున్న భారతీయులు అక్కడి నివాస, వీసా నిబంధనలను విధిగా పాటించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇప్పటివరకు అనేకమంది భారతీయులు అరెస్టయ్యారు. వీసా గడువు తీరిపోయాక కూడా అక్కడే ఉండడం, ఇళ్లలో పనిచేయడానికి అనుమతి తీసుకుని, కార్యాలయాల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడం వంటి నేరాలపై వారు అరెస్టయ్యారని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ తమ వద్దే ఉంచుకుని భద్రతా తనిఖీలప్పుడు చూపించాలని భారతీయులకు సూచించింది. దేశ బహిష్కరణకు గురైన భారతీయులకు ప్రయాణ పత్రాలను అందిస్తామని ఎంబసీ చెప్పింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం