ఫ్లిప్కార్ట్ కొత్త సెంటర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- May 02, 2023
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ సంగారెడ్డిలో ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ను వర్చువల్ విధానంలో మంగళవారం ఉదయం ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో జరిగిన ఈ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే దేశం అదే ఫాలో అవుతుంది. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పని చేస్తున్నాయి. ఉపాధి కల్పనలో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలి. దేశానికి తెలంగాణను రోల్ మోడల్గా మారుద్దాం అని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్తో పాటు పలువురు హాజరయ్యారు.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









