ఇండియా సహా 7 దేశాల పాస్పోర్ట్లో వీసా స్టిక్కర్లు రద్దు: సౌదీ
- May 05, 2023
యూఏఈ: యూఏఈ, ఇండియా, ఫిలిప్పీన్స్తో సహా ఏడు దేశాలలో తమ మిషన్ల కోసం ఇప్పుడు వీసా స్టిక్కర్లను ఇ-వీసాలతో భర్తీ చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సాధారణంగా ఒక వ్యక్తి పాస్పోర్ట్పై ఉంచే స్టిక్కర్కు బదులుగా, డేటాను చదవడానికి క్యూఆర్ కోడ్లు ఉపయోగించబడుతున్నాయని కింగ్డమ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఏఈ, ఇండియా, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోని సౌదీ అరేబియా మిషన్లలో మే 1 నుండి ఈ వ్యవస్థ అమలులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ గెజిట్లోని నివేదిక ప్రకారం.. కాన్సులర్ సేవలను ఆటోమేట్ చేయడానికి.. వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలతో సహా వివిధ రకాల వీసాల మంజూరు కోసం ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







