ఇండియా సహా 7 దేశాల పాస్పోర్ట్లో వీసా స్టిక్కర్లు రద్దు: సౌదీ
- May 05, 2023
యూఏఈ: యూఏఈ, ఇండియా, ఫిలిప్పీన్స్తో సహా ఏడు దేశాలలో తమ మిషన్ల కోసం ఇప్పుడు వీసా స్టిక్కర్లను ఇ-వీసాలతో భర్తీ చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సాధారణంగా ఒక వ్యక్తి పాస్పోర్ట్పై ఉంచే స్టిక్కర్కు బదులుగా, డేటాను చదవడానికి క్యూఆర్ కోడ్లు ఉపయోగించబడుతున్నాయని కింగ్డమ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఏఈ, ఇండియా, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోని సౌదీ అరేబియా మిషన్లలో మే 1 నుండి ఈ వ్యవస్థ అమలులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ గెజిట్లోని నివేదిక ప్రకారం.. కాన్సులర్ సేవలను ఆటోమేట్ చేయడానికి.. వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలతో సహా వివిధ రకాల వీసాల మంజూరు కోసం ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!
- అమెరికా వెళ్లే.. ఖతార్ ఫుట్బాల్ అభిమానుల కోసం గైడ్ లైన్స్ జారీ..!!
- వాట్సాప్ ఫేక్ కాల్స్కు ఇక ఫుల్ స్టాప్!
- తెలంగాణ ప్రజలకు బిగ్అలర్ట్..
- ఏపీలో కొత్తగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు









