ఇండియా సహా 7 దేశాల పాస్పోర్ట్లో వీసా స్టిక్కర్లు రద్దు: సౌదీ
- May 05, 2023
యూఏఈ: యూఏఈ, ఇండియా, ఫిలిప్పీన్స్తో సహా ఏడు దేశాలలో తమ మిషన్ల కోసం ఇప్పుడు వీసా స్టిక్కర్లను ఇ-వీసాలతో భర్తీ చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సాధారణంగా ఒక వ్యక్తి పాస్పోర్ట్పై ఉంచే స్టిక్కర్కు బదులుగా, డేటాను చదవడానికి క్యూఆర్ కోడ్లు ఉపయోగించబడుతున్నాయని కింగ్డమ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఏఈ, ఇండియా, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోని సౌదీ అరేబియా మిషన్లలో మే 1 నుండి ఈ వ్యవస్థ అమలులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ గెజిట్లోని నివేదిక ప్రకారం.. కాన్సులర్ సేవలను ఆటోమేట్ చేయడానికి.. వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలతో సహా వివిధ రకాల వీసాల మంజూరు కోసం ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









