ఇండియా సహా 7 దేశాల పాస్పోర్ట్లో వీసా స్టిక్కర్లు రద్దు: సౌదీ
- May 05, 2023
యూఏఈ: యూఏఈ, ఇండియా, ఫిలిప్పీన్స్తో సహా ఏడు దేశాలలో తమ మిషన్ల కోసం ఇప్పుడు వీసా స్టిక్కర్లను ఇ-వీసాలతో భర్తీ చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సాధారణంగా ఒక వ్యక్తి పాస్పోర్ట్పై ఉంచే స్టిక్కర్కు బదులుగా, డేటాను చదవడానికి క్యూఆర్ కోడ్లు ఉపయోగించబడుతున్నాయని కింగ్డమ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఏఈ, ఇండియా, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోని సౌదీ అరేబియా మిషన్లలో మే 1 నుండి ఈ వ్యవస్థ అమలులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ గెజిట్లోని నివేదిక ప్రకారం.. కాన్సులర్ సేవలను ఆటోమేట్ చేయడానికి.. వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలతో సహా వివిధ రకాల వీసాల మంజూరు కోసం ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







