భోజనం తర్వాత నిద్ర.! ఆరోగ్యం జర భద్రం సుమా.!

- May 17, 2023 , by Maagulf
భోజనం తర్వాత నిద్ర.! ఆరోగ్యం జర భద్రం సుమా.!

పుష్టిగా భోజనం చేశాకా, సుష్టిగా ఓ కునుకు లాగించేయడం చాలా మందికి అలవాటుగా వుంటుంది. కానీ, ఆ అలవాటు ఆరోగ్యానికి అత్యంత చేటుగా ఆహార నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం వల్ల జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహార అణువుల జీర్ణ ప్రక్రియ విచ్చిన్నం కావడంతో, అజీర్తి సమస్యలు తలెతుత్తుతాయ్.

ఇదే అలవాటుగా మారితే, జీర్ణ ప్రక్రియ క్రమ క్రమంగా మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే భోజనం తర్వాత పండ్లు తినడం కూడా మంచిది కాదంటున్నారు. భోజనానికి రెండు గంటలు ముందు అయినా, రెండు గంటల తర్వాత అయినా పండ్లను సేవిస్తే మంచిది.

భోజనం తర్వాత ధూమపానం చేయడం, టీ, కాఫీలు తాగడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

సో, ఇలాంటి అలవాట్లు వున్న వారు ఆరోగ్యం మీద ఏ మాత్రం శ్రద్ధ వున్నా వాటికి దూరంగా వుంటే మంచిదని నిఫుణుల సూచన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com