భోజనం తర్వాత నిద్ర.! ఆరోగ్యం జర భద్రం సుమా.!
- May 17, 2023
పుష్టిగా భోజనం చేశాకా, సుష్టిగా ఓ కునుకు లాగించేయడం చాలా మందికి అలవాటుగా వుంటుంది. కానీ, ఆ అలవాటు ఆరోగ్యానికి అత్యంత చేటుగా ఆహార నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం వల్ల జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహార అణువుల జీర్ణ ప్రక్రియ విచ్చిన్నం కావడంతో, అజీర్తి సమస్యలు తలెతుత్తుతాయ్.
ఇదే అలవాటుగా మారితే, జీర్ణ ప్రక్రియ క్రమ క్రమంగా మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే భోజనం తర్వాత పండ్లు తినడం కూడా మంచిది కాదంటున్నారు. భోజనానికి రెండు గంటలు ముందు అయినా, రెండు గంటల తర్వాత అయినా పండ్లను సేవిస్తే మంచిది.
భోజనం తర్వాత ధూమపానం చేయడం, టీ, కాఫీలు తాగడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
సో, ఇలాంటి అలవాట్లు వున్న వారు ఆరోగ్యం మీద ఏ మాత్రం శ్రద్ధ వున్నా వాటికి దూరంగా వుంటే మంచిదని నిఫుణుల సూచన.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి