జ్యోతిలక్ష్మిపై పుస్తకం ఆవిష్కరణ

- May 11, 2016 , by Maagulf
జ్యోతిలక్ష్మిపై పుస్తకం ఆవిష్కరణ

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఛార్మి కథానాయికగా నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'. ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని రచయిత్రి మంగళ గౌరి కేవలం మూడు రోజుల్లో జ్యోతిలక్ష్మి అనే పుస్తకాన్ని రచించారు. ఇవాళ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నటుడు తనికెళ్ల భరణి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఛార్మి, పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ పూరీ, సత్య, శాండీ, సునీల్‌ కశ్యప్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... సినిమాని చూసి పుస్తకం రాయడం ఇదే ప్రప్రథమం అన్నారు. పీహెచ్‌డీ గ్రంథాన్ని ఎలా పరిశోధన చేసి రాస్తారో... అదే స్థాయిలో మంగళ గౌరి ఈ పుస్తకాన్ని రాశారని తెలిపారు.
తాను నటించిన సినిమాపై పుస్తకం రావడం ఆనందంగా ఉందని, పూరీ లేకపోతే ఈ సినిమా లేదని నటి ఛార్మి అన్నారు. ఈ సినిమా చేసిన తరువాత దుబాయ్‌, యూఎస్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా తనని జ్యోతిలక్ష్మీ అని పిలుస్తున్నారని ఛార్మి తెలిపారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మి నటించిన 'మిథునం' చిత్రంపై కూడా ఓ పుస్తకం రాయనున్నట్లు రచయిత్రి మంగళ గౌరి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com