జ్యోతిలక్ష్మిపై పుస్తకం ఆవిష్కరణ
- May 11, 2016
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి కథానాయికగా నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'. ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని రచయిత్రి మంగళ గౌరి కేవలం మూడు రోజుల్లో జ్యోతిలక్ష్మి అనే పుస్తకాన్ని రచించారు. ఇవాళ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో నటుడు తనికెళ్ల భరణి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఛార్మి, పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ, సత్య, శాండీ, సునీల్ కశ్యప్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... సినిమాని చూసి పుస్తకం రాయడం ఇదే ప్రప్రథమం అన్నారు. పీహెచ్డీ గ్రంథాన్ని ఎలా పరిశోధన చేసి రాస్తారో... అదే స్థాయిలో మంగళ గౌరి ఈ పుస్తకాన్ని రాశారని తెలిపారు.
తాను నటించిన సినిమాపై పుస్తకం రావడం ఆనందంగా ఉందని, పూరీ లేకపోతే ఈ సినిమా లేదని నటి ఛార్మి అన్నారు. ఈ సినిమా చేసిన తరువాత దుబాయ్, యూఎస్ ఇలా ఎక్కడికి వెళ్లినా తనని జ్యోతిలక్ష్మీ అని పిలుస్తున్నారని ఛార్మి తెలిపారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మి నటించిన 'మిథునం' చిత్రంపై కూడా ఓ పుస్తకం రాయనున్నట్లు రచయిత్రి మంగళ గౌరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









