రాయబార కార్యాలయంలో విధ్వంసం.. తీవ్రంగా ఖండించిన సౌదీ
- June 09, 2023
రియాద్: సుడాన్ రాజధాని ఖార్టూమ్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ భవనంలో కొన్ని సాయుధ గ్రూపులు జరిపిన విధ్వంసాన్ని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సౌదీ సిబ్బంది నివాసాలు, ఆస్తులను ధ్వంసం చేయడంపై మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య కార్యకలాపాలు శాంతికి చిహ్నాలని, వాటిపై విధ్వంసక చర్యలు సరికావని హితవు చెప్పింది. సుడాన్ ప్రజల భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ సాయుధ సమూహాలను ఎదుర్కోవాలన్న ప్రాముఖ్యతను కూడా ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయని పేర్కొంది.
అలాగే బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రధాన కార్యాలయం, సూడాన్ రాజధానిలోని రాయబారి ఇంటిపై సాయుధ బృందం దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి సౌదీ-అమెరికన్ చొరవ తీసుకోవాలని కోరింది. దేశంలో తిరిగి శాంతిని నెలకోల్పాలని సూడాన్ లోని పార్టీలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









