ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు తెరచి ఉండగానే టేకాఫ్..
- June 22, 2023
న్యూ ఢిల్లీ: ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు. విమానం ఇంధన ప్యానల్ తెరచి ఉండటంపై ఏటీసీకి సమాచారం అందించారు.
మైసూర్ విమానాశ్రయంలో ఈ విమానంలోకి ఇంధనం నింపలేదు. అయినా ఇంధన ట్యాంకు మూత ఎలా తెరచి ఉందనే విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)విచారణకు ఆదేశించింది. మైసూర్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన ఎలియన్స్ ఎయిర్ విమానం వెంటనే తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. విమానం ఇంధన ట్యాంకు ప్యానల్ గాలిలో తెరుచుకున్నట్లు చెబుతున్నారు.
ఇలా విమానం ఇంధన ట్యాంకు తెరిచి ఉండటం వల్ల పెద్ద ప్రమాదం జరిగేదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.ఈ ఘటనపై విమానయాన సంస్థ ప్రకటన చేయడానికి నిరాకరించింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









