మక్కా, మదీనాలో 81వేల యాత్రికులకు వైద్య సేవలు
- June 27, 2023
మినా: మక్కా, మదీనాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో జూన్ 19 నుండి మొత్తం 80,973 మంది యాత్రికులు వైద్య సంరక్షణ నుండి ప్రయోజనం పొందారని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవల్లో 23 ఓపెన్-హార్ట్ సర్జరీలు, 168 కార్డియాక్ కాథెటర్లు, 464 డయాలసిస్ సెషన్లు, 41 ఎండోస్కోపీలు ఉన్నాయని పేర్కొంది. హజ్ సమయంలో వేడి వల్ల కలిగే ప్రమాదాల గురించి మంత్రిత్వ శాఖ యాత్రికులను అప్రమత్తం చేసింది. గొడుగులను ఉపయోగించడం, పుష్కలంగా ద్రవాలు తాగడం, శారీరక శ్రమను నివారించడం, ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించడం వల్ల యాత్రికులను హీట్స్ట్రోక్ లేదా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, అరాఫత్లో నిర్వహించే ఆసుపత్రులు యాత్రికులకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జబల్ అల్-రహ్మా హాస్పిటల్, అరాఫత్ జనరల్ హాస్పిటల్, నమేరా హాస్పిటల్, ఈస్ట్ అరాఫత్ హాస్పిటల్, అలాగే ఒక ఫీల్డ్ హాస్పిటల్ మరియు 46 ఆరోగ్య కేంద్రాలు వివిధ వైద్య రంగాలలో నైపుణ్యం కలిగిన 1,700 మందికి పైగా సిబ్బందితో నిర్వహిస్తున్నట్ల తెలిపింది. నాలుగు ఆసుపత్రుల్లో 900 కంటే ఎక్కువ పడకలు సిద్ధం చేశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల మాదిరిగానే వడదెబ్బ, వేడి అలసట మరియు ఇతర అత్యవసర కేసులను డీల్ చేసేందుకు సన్నద్ధమయ్యామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







