పాఠశాలలకు విద్యుత్ నిలిపివేత పుకార్లను ఖండించిన మంత్రిత్వ శాఖ
- July 31, 2023
కువైట్: కొన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాలు, గుడిసెలు మరియు పొలాలలో విద్యుత్తును నిలిపివేయడం గురించిన అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తుందని, వాటిల్లో వాస్తవం లేదని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రొటీన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఏటా వేసవి కాలానికి ముందు అమలు చేయబడుతుందని అందులో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలను అందించడానికి సాధ్యమయ్యే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్తు, నీటిని ఆదా చేయడం, వినియోగంలో వ్యర్థాలను తగ్గించడం, వాటిని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా దేశ వనరులను సంరక్షించడం, నిలబెట్టుకోవడం కోసం మంత్రిత్వ శాఖ అవగాహన ప్రచారాలను కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









