పాఠశాలలకు విద్యుత్ నిలిపివేత పుకార్లను ఖండించిన మంత్రిత్వ శాఖ
- July 31, 2023
కువైట్: కొన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాలు, గుడిసెలు మరియు పొలాలలో విద్యుత్తును నిలిపివేయడం గురించిన అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తుందని, వాటిల్లో వాస్తవం లేదని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రొటీన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఏటా వేసవి కాలానికి ముందు అమలు చేయబడుతుందని అందులో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలను అందించడానికి సాధ్యమయ్యే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్తు, నీటిని ఆదా చేయడం, వినియోగంలో వ్యర్థాలను తగ్గించడం, వాటిని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా దేశ వనరులను సంరక్షించడం, నిలబెట్టుకోవడం కోసం మంత్రిత్వ శాఖ అవగాహన ప్రచారాలను కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







