పాఠశాలలకు విద్యుత్ నిలిపివేత పుకార్లను ఖండించిన మంత్రిత్వ శాఖ
- July 31, 2023
కువైట్: కొన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాలు, గుడిసెలు మరియు పొలాలలో విద్యుత్తును నిలిపివేయడం గురించిన అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తుందని, వాటిల్లో వాస్తవం లేదని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రొటీన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఏటా వేసవి కాలానికి ముందు అమలు చేయబడుతుందని అందులో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలను అందించడానికి సాధ్యమయ్యే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్తు, నీటిని ఆదా చేయడం, వినియోగంలో వ్యర్థాలను తగ్గించడం, వాటిని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా దేశ వనరులను సంరక్షించడం, నిలబెట్టుకోవడం కోసం మంత్రిత్వ శాఖ అవగాహన ప్రచారాలను కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!