తెలంగాణలో కలవరపెడుతున్న ‘కండ్లకలక’ కేసులు..
- July 31, 2023
హైదరాబాద్: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, ఫ్లూతో పాటు కండ్లకలక కేసులు హాస్పటల్స్ లలో ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ, కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత పది రోజులుగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ లో అతి భారీ వర్షాలు పడడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటీకే ప్రభుత్వ హాస్పటల్స్ తో పాటు ప్రవైట్ హాస్పటల్స్ లలో డెంగ్యూ కేసులు నమోదు అవుతుండగా..రెండు రోజులుగా కండ్లకలక కేసులు ఎక్కువయ్యాయి అంటున్నారు డాక్టర్స్.
ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే..
సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని , జలుబు కారకమైన వైరస్తో కూడా కండ్లకలక వస్తుందని అంటున్నారు. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని అంటున్నారు. కండ్లకలక అనేది చిన్న ఇన్ఫెక్షనే అయినప్పటికీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని , ఏ పని చేసుకోనీయకుండా ఇబ్బంది పెడుతుందని డాక్టర్స్ చెపుతున్నారు. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరగడం వల్ల వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.
ఈ కండ్లకలక ను గుర్తించడం ఎలా..?
కంటి నుండి తరుచు నీరు కారడం, కంటి నొప్పి దురద, మంట రావడం , కంటి రెప్పలు వాపు, ఉబ్బడం, పడుకున్నప్పుడు కంటి రెప్పలు అంటుకొని ఉండడం వంటివి జరిగితే..మీరు ‘కండ్లకలక’ వ్యాధిని పడ్డట్లే.
కండ్లకలక వ్యాధిని పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఒకవేళ మీరు కండ్లకలక తో బాధపడుతుంటే..కంటిని తరుచు నీటితో కడుక్కోవాలి. కండ్ల కలక వచ్చిన వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు వాడిన వస్తువులు వాడరాదు. ఈ వ్యాధి వచ్చిన వారి టవల్స్, కర్చీఫ్లు ఇతరులు వాడకూడదు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. కండ్ల కలక వచ్చిన వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఆకు కూరలు, క్యారెట్లు, సిట్రన్ ఫ్రూట్స్ ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









