తెలంగాణలో ఇద్దరు గల్ఫ్ ఏజెంట్ల అరెస్ట్
- August 20, 2023
తెలంగాణ: గల్ఫ్ పంపిస్తామని మోసం చేసిన జగిత్యాల జిల్లాలోని మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి చెందిన ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు. జిల్లా కేంద్రం లోని టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. బుగ్గారం మండలం శేకల్లకు చెందిన రాచకొండ మహేశ్, పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన మహేశ్ జగిత్యాలలో విఘ్నేశ్వర మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. గల్ఫ్ కు పంపిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశారు. వారం కింద 120 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేపట్టారు. ఎస్పీ భాస్కర్ ఆదేశాలతో మూడు టీంలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితుల నుంచి రూ.2.90 కోట్లు వసూలు చేసినట్లు తేలిందన్నారు.
నిందితుల వద్ద రెండు కార్లు, మూడు తులాల బంగారం, .ఐదు లక్షల విలువ చేసే ఫోన్లు,2.50లక్షల నగదు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు,ఏసీలు స్వాధీనం చేసుకున్నాట్లు డీఎస్పీ వివరించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా)
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









