మధురైలో రైలు ప్రమాదం...10 మంది సజీవ దహనం
- August 26, 2023
తమిళనాడు: మధురైలో స్టేషన్లో ఆగి ఉన్న రైలు కోచ్ లో మంటలు చెలరేగి పది మంది మరణించగా మరో 20 మందికి గాయాలయ్యాయి. లఖ్నవూ నుంచి రామేశ్వరం వెళ్తున్న ప్రత్యేక రైలులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. రైలు నాగర్కోయిల్ జంక్షన్ నుంచి మదురైకి చేరుకోగా కోచ్ని వేరు చేసి మదురై స్టాబ్లింగ్ లైన్లో ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యేక రైలు కోచ్లోని ప్రయాణికులు గ్యాస్ సిలిండర్ను అక్రమంగా తమతో తీసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.
టీ చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. మంటలను గమనించిన చాలా మంది ప్రయాణికులు కోచ్ నుంచి బయటకు వచ్చారు. కొంత మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. IRCTC పోర్టల్ని ఉపయోగించి ఎవరైనా పార్టీ కోచ్ని బుక్ చేసుకోవచ్చని... కానీ గ్యాస్ సిలిండర్ వంటి మండే పదార్థాలను తీసుకెళ్లడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. కోచ్ను రవాణా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







