మచిలీపట్నానికి 230కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం

- May 18, 2016 , by Maagulf
మచిలీపట్నానికి 230కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఒడిశా తీరం వైపు క్రమంగా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది బుధవారం అర్ధరాత్రి తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com