నకిలీ వాట్సాప్ మెస్సేజుల స్కామర్లు అరెస్ట్
- September 01, 2023
యూఏఈ: ఫిషింగ్, ఫోన్ స్కామ్లకు పాల్పడుతూ నివాసితుల బ్యాంకు ఖాతాల నుండి భారీ మొత్తంలో డబ్బును దొంగిలిస్తున్న మోసగాళ్ల ముఠాను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ స్కామ్కు సంబంధించి దేశం లోపల మరియు వెలుపల ఉన్న ఏడుగురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ లేదా ఫేక్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా నివాసితులను సంప్రదిస్తుందని పోలీసులు తెలిపారు. అప్పుడు, డేటా అందించకపోతే వారి ఖాతాలు బ్లాక్ చేయబడతాయని చెప్పడం ద్వారా వారు బ్యాంకు వివరాలను తెలుసుకుంటున్నారని రస్ అల్ ఖైమా పోలీస్లో తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్, బ్రిగ్-జనరల్ తారిఖ్ ముహమ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. షార్జా పోలీసుల సహకారంతో స్కామర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్కామర్ల నుంచి "పెద్ద సంఖ్యలో బ్యాంకు కార్డులను" కూడా జప్తు చేసినట్లు చెప్పారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







