నకిలీ వాట్సాప్ మెస్సేజుల స్కామర్లు అరెస్ట్
- September 01, 2023
యూఏఈ: ఫిషింగ్, ఫోన్ స్కామ్లకు పాల్పడుతూ నివాసితుల బ్యాంకు ఖాతాల నుండి భారీ మొత్తంలో డబ్బును దొంగిలిస్తున్న మోసగాళ్ల ముఠాను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ స్కామ్కు సంబంధించి దేశం లోపల మరియు వెలుపల ఉన్న ఏడుగురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ లేదా ఫేక్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా నివాసితులను సంప్రదిస్తుందని పోలీసులు తెలిపారు. అప్పుడు, డేటా అందించకపోతే వారి ఖాతాలు బ్లాక్ చేయబడతాయని చెప్పడం ద్వారా వారు బ్యాంకు వివరాలను తెలుసుకుంటున్నారని రస్ అల్ ఖైమా పోలీస్లో తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్, బ్రిగ్-జనరల్ తారిఖ్ ముహమ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. షార్జా పోలీసుల సహకారంతో స్కామర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్కామర్ల నుంచి "పెద్ద సంఖ్యలో బ్యాంకు కార్డులను" కూడా జప్తు చేసినట్లు చెప్పారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









