నకిలీ వాట్సాప్ మెస్సేజుల స్కామర్లు అరెస్ట్
- September 01, 2023
యూఏఈ: ఫిషింగ్, ఫోన్ స్కామ్లకు పాల్పడుతూ నివాసితుల బ్యాంకు ఖాతాల నుండి భారీ మొత్తంలో డబ్బును దొంగిలిస్తున్న మోసగాళ్ల ముఠాను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ స్కామ్కు సంబంధించి దేశం లోపల మరియు వెలుపల ఉన్న ఏడుగురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ లేదా ఫేక్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా నివాసితులను సంప్రదిస్తుందని పోలీసులు తెలిపారు. అప్పుడు, డేటా అందించకపోతే వారి ఖాతాలు బ్లాక్ చేయబడతాయని చెప్పడం ద్వారా వారు బ్యాంకు వివరాలను తెలుసుకుంటున్నారని రస్ అల్ ఖైమా పోలీస్లో తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్, బ్రిగ్-జనరల్ తారిఖ్ ముహమ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. షార్జా పోలీసుల సహకారంతో స్కామర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్కామర్ల నుంచి "పెద్ద సంఖ్యలో బ్యాంకు కార్డులను" కూడా జప్తు చేసినట్లు చెప్పారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







