హెలికాప్టర్ సముద్రంలో రెండో పైలట్ కూడా మృతి

- September 11, 2023 , by Maagulf
హెలికాప్టర్ సముద్రంలో రెండో పైలట్ కూడా మృతి

యూఏఈ: ఉమ్ అల్ క్వైన్‌లో గురువారం జరిగిన ఏరోగల్ఫ్ 'బెల్ 212' ఛాపర్ క్రాష్‌లో రెండవ పైలట్ కూడా మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రెండో పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారని ఏరోగల్ఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. "హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులో ప్రయాణీకులు లేరు. ఇద్దరు సిబ్బంది మరణించినట్లు మేము నిర్ధారించగలము" అని కంపెనీ తెలిపింది.  ఏరోగల్ఫ్ ప్రకటన ప్రకారం.. హెలికాప్టర్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం,  ఆఫ్‌షోర్ రిగ్ మధ్య సాధారణ శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 7న రాత్రి 8.07 గంటలకు యూఏఈ తీరం దగ్గర సముద్రంలో కూలిపోయింది. ఆ మరుసటి రోజు యూఏఈ జనరల్ ఏవియేషన్ అథారిటీ మొదటి పైలట్ మరణాన్ని ధృవీకరించింది. అయితే రెండవ పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పైలట్‌లలో ఒకరిది ఈజిప్టు కాగా, మరొకరిది దక్షిణాఫ్రికా అని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com