మస్కట్లో ఒమానీ సుల్తాన్ను కలిసిన క్రౌన్ ప్రిన్స్
- September 14, 2023
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ను సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సమావేశమయ్యారు. మస్కట్లోని అల్-బరాకా ప్యాలెస్లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒమన్ , సౌదీ అరేబియా మధ్య శాశ్వతమైన సోదర సంబంధాలను బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై సమీక్షించారు. సౌదీ యువరాజు మహ్మద్తో పాటు నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్, రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్, సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ సహా ప్రముఖ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఒమన్కు రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిఖ్, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రి సయ్యద్ ధి యజాన్ బిన్ హైతం, సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









