ఆసియా ఛాంపియన్స్గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?
- September 18, 2023
శ్రీలంక: ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక – భారత్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు హైదరాబాదీ వాసి, టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజుద్దీన్ చుక్కలు చూపించారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. సిరాజ్ తో పాటు బుమ్రా, ఇతర బౌలర్లు తమ సత్తాను చాటడంతో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆటౌస్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు కేవలం 6.1 ఓవర్లలో 51 పరుగుల టార్గెట్ను పూర్తిచేసి విజేతగా నిలిచింది.
ఆసియా కప్ 2023 టైటిల్ దక్కించుకున్న భారత్ జట్టుకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది. రోహిత్ సేన 150000 డాలర్లు ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్గా నిలిచిన శ్రీలంక జట్టుకు 75000 డాలర్లు ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు విజయానికి కారణమైన ఫాస్ట్బౌలర్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో 5000 డాలర్లు అందుకున్నాడు. ఆ మొత్తాన్ని శ్రీలంక గ్రౌండ్ మెన్స్కు అందజేశారు.
టీమిండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ కుల్దీప్ కు లభించింది. ఈ మేరకు సుమారు 15,000 డాలర్లు ప్రైజ్ మనీగా అందుకున్నాడు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!