ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేరళకు 200kg లగేజీ పరిమితి, Dh440 టిక్కెట్ ధర..!
- September 18, 2023
యూఏఈ: యూఏఈ, దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ మధ్య ప్రయాణీకుల షిప్ సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది భారతీయ ప్రవాసులకు సౌకర్యవంతమైన .. తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ విధానాన్ని అందిస్తుంది. దాదాపు Dh442 టిక్కెట్ల ధర ఉండే అవకాశం ఉన్నది. ఈ సర్వీస్ భారతీయ ప్రవాసులు కేరళకు దాదాపు మూడు రోజుల్లో చేరుకోవచ్చని ఇండియన్ అసోసియేషన్ షార్జా ప్రెసిడెంట్ వైఏ రహీమ్ తెలిపారు. “డిసెంబర్లో పాఠశాల విరామానికి ముందు సేవను ప్రారంభించడం, అమలు చేయాలనే ఆలోచన ఉంది. యూఏఈలోని భారతీయ ప్రవాసులు అధిక ఎయిర్లైన్ ఛార్జీలు చెల్లించకుండా వారి స్వస్థలానికి వెళ్లేలా మేము ప్రణాళికలు రూపొందించాం.’’ అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కేరళ ప్రభుత్వ ప్రతినిధులు సెప్టెంబర్ 24న భారత కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తారని తెలిపారు. దీంతో తాము నవంబర్ నాటికి సర్వీస్ ట్రయల్ రన్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!