ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేరళకు 200kg లగేజీ పరిమితి, Dh440 టిక్కెట్ ధర..!
- September 18, 2023
యూఏఈ: యూఏఈ, దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ మధ్య ప్రయాణీకుల షిప్ సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది భారతీయ ప్రవాసులకు సౌకర్యవంతమైన .. తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ విధానాన్ని అందిస్తుంది. దాదాపు Dh442 టిక్కెట్ల ధర ఉండే అవకాశం ఉన్నది. ఈ సర్వీస్ భారతీయ ప్రవాసులు కేరళకు దాదాపు మూడు రోజుల్లో చేరుకోవచ్చని ఇండియన్ అసోసియేషన్ షార్జా ప్రెసిడెంట్ వైఏ రహీమ్ తెలిపారు. “డిసెంబర్లో పాఠశాల విరామానికి ముందు సేవను ప్రారంభించడం, అమలు చేయాలనే ఆలోచన ఉంది. యూఏఈలోని భారతీయ ప్రవాసులు అధిక ఎయిర్లైన్ ఛార్జీలు చెల్లించకుండా వారి స్వస్థలానికి వెళ్లేలా మేము ప్రణాళికలు రూపొందించాం.’’ అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కేరళ ప్రభుత్వ ప్రతినిధులు సెప్టెంబర్ 24న భారత కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తారని తెలిపారు. దీంతో తాము నవంబర్ నాటికి సర్వీస్ ట్రయల్ రన్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







