చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

- September 26, 2023 , by Maagulf
చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి వెల్లడించారు. బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా.. ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు జడ్జి తెలిపారు. బుధవారం రెగ్యులర్‌ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com