GCC నివాసితులకు త్వరలో ఒకే వీసా
- September 27, 2023
యూఏఈ: ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒకే వీసా విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ తెలిపారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ ప్రకటించింది. అతి త్వరలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం GCC దేశాల పౌరులు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్లకు వీసా రహిత ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఈ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి. కొన్ని జాతీయులకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంది. మంగళవారం అబుధాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్లో అల్ మర్రి పాన్-జిసిసి సింగిల్ వీసాపై మాట్లాడారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక