భారత్‌లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటాo..

- May 21, 2016 , by Maagulf
భారత్‌లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటాo..

భారత్‌లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదసంస్థ 'ఇస్లామిక్‌స్టేట్‌' (ఐఎస్‌) హెచ్చరించింది. ఈ మేరకు 22 నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసింది. కశ్మీర్‌తోపాటు బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్‌, ముజఫర్‌నగర్‌లలో మతకల్లోలాల సందర్భంగా ముస్లింలపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. చెట్లను, ఆవులను, సూర్యుడిని పూజించే హిందువులతో కలిసి జీవించటమేమిటంటూ భారత్‌లోని ముస్లింలను ఎద్దేవా చేశారు. ఐఎస్‌ ఆధీనంలోని ప్రాంతాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐఎస్‌ తరఫున సిరియాలో పనిచేస్తున్నారంటూ అయిదుగురు భారతీయ యువకులను వీడియోలో పరిచయం చేశారు. వివిధ ప్రశ్నలకు వారిసమాధానాలను చిత్రీకరించారు. ఈ యువకుల్లో ఒకడు థానెకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఫహాద్‌ తన్వీర్‌ షేక్‌ అని వెల్లడైంది. ఫహాద్‌ 2014లో ముగ్గురితో కలిసి సిరియాకు వెళ్లిపోయాడు. వీడియోలో ఫహాద్‌ తననుతాను అబూఅమ్రాఅల్‌హిందీ అని పరిచయం చేసుకున్నాడు. తనతోపాటు సిరియాకు వచ్చి మరణించిన షమీమ్‌కు నివాళి అర్పించాడు. ప్రతీకారం తీర్చుకోవటానికి కత్తులు చేతపట్టుకొని భారత్‌కు వస్తామంటూ హెచ్చరించాడు. ఫహాద్‌తోపాటు సిరియా వెళ్లిన అరీబ్‌మజిద్‌ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆధీనంలో ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com