భారత్లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటాo..
- May 21, 2016
భారత్లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదసంస్థ 'ఇస్లామిక్స్టేట్' (ఐఎస్) హెచ్చరించింది. ఈ మేరకు 22 నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసింది. కశ్మీర్తోపాటు బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్, ముజఫర్నగర్లలో మతకల్లోలాల సందర్భంగా ముస్లింలపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. చెట్లను, ఆవులను, సూర్యుడిని పూజించే హిందువులతో కలిసి జీవించటమేమిటంటూ భారత్లోని ముస్లింలను ఎద్దేవా చేశారు. ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐఎస్ తరఫున సిరియాలో పనిచేస్తున్నారంటూ అయిదుగురు భారతీయ యువకులను వీడియోలో పరిచయం చేశారు. వివిధ ప్రశ్నలకు వారిసమాధానాలను చిత్రీకరించారు. ఈ యువకుల్లో ఒకడు థానెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహాద్ తన్వీర్ షేక్ అని వెల్లడైంది. ఫహాద్ 2014లో ముగ్గురితో కలిసి సిరియాకు వెళ్లిపోయాడు. వీడియోలో ఫహాద్ తననుతాను అబూఅమ్రాఅల్హిందీ అని పరిచయం చేసుకున్నాడు. తనతోపాటు సిరియాకు వచ్చి మరణించిన షమీమ్కు నివాళి అర్పించాడు. ప్రతీకారం తీర్చుకోవటానికి కత్తులు చేతపట్టుకొని భారత్కు వస్తామంటూ హెచ్చరించాడు. ఫహాద్తోపాటు సిరియా వెళ్లిన అరీబ్మజిద్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధీనంలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









