ఇజ్రాయెల్ దాడుల్లో 10,000 దాటిన మృతులు
- November 07, 2023
యూఏఈ: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 10,000 దాటిందని గాజా స్ట్రిప్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 10,022 మంది మరణించినట్లు గాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రే ప్రకటించారు. యుద్ధం మొదలై నెల రోజులు దగ్గర పడుతుంది. అక్టోబరు 7న హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్లో 1,400 మంది చనిపోగా.. ఇజ్రాయోల్ ప్రతీకార దాడుల్లో 10 వేలకుపైగా పాలస్తీయన్లు మరణించారు. హమాస్ కిడ్నాప్ చేసిన 240 మందికి పైగా బందీలను విడిపించే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..









