ఇజ్రాయెల్ దాడుల్లో 10,000 దాటిన మృతులు

- November 07, 2023 , by Maagulf
ఇజ్రాయెల్ దాడుల్లో 10,000 దాటిన మృతులు

యూఏఈ: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 10,000 దాటిందని గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 10,022 మంది మరణించినట్లు గాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రే ప్రకటించారు.  యుద్ధం మొదలై నెల రోజులు దగ్గర పడుతుంది. అక్టోబరు 7న హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మంది చనిపోగా.. ఇజ్రాయోల్ ప్రతీకార దాడుల్లో 10 వేలకుపైగా పాలస్తీయన్లు మరణించారు. హమాస్ కిడ్నాప్ చేసిన 240 మందికి పైగా బందీలను విడిపించే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com