వీసా కోసం ఎదురుచూస్తున్న వరుణ్
- May 26, 2016
ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలతో ఆకట్టుకున్న వరుణ్తేజ్ హీరోగా 'మిస్టర్' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ స్పెయిన్లో 10 రోజులపాటు జరగనున్నట్లు కథ అందించిన గోపీమోహన్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. శ్రీధర్ సిపాన 'మిస్టర్' సినిమా డైలాగ్స్ను పూర్తి చేశారని, శ్రీను వైట్ల, టీం షూటింగ్ కోసం అందమైన లొకేషన్స్ని వెతికారని పేర్కొన్నారు. వీసా కోసం ఎదురుచూస్తున్నట్లు పోస్ట్ చేశారు.శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. నల్ల మలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. నాజర్, రఘుబాబు, శ్రీనివాస్రెడ్డి, పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్పెయిన్ షూటింగ్ అనంతరం బ్రెజిల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









