ఒమన్ లో OMR4.6bn విలువైన ఆరు ప్రాజెక్టులు ప్రారంభం
- December 04, 2023
మస్కట్: ఒమన్ 53వ జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు జాతీయ వేడుకల కోసం సెక్రటేరియట్ జనరల్ షెడ్యూల్ సిద్ధం చేసింది. జాతీయ దినోత్సవ వేడుకల కార్యక్రమం సందర్భంగా ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) ఇటీవల ఆరు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ప్రకటించింది. దుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రాజెక్ట్, దుక్మ్ ఇంటిగ్రేటెడ్ పవర్ అండ్ వాటర్ స్టేషన్, రాస్ మర్కజ్ క్రూడ్ ఆయిల్ పార్క్, ఖువైమాహ్ ష్రిమ్ప్ ఫామ్, ఒక విద్యుత్ ప్రసార ప్రాజెక్ట్ మరియు JW మారియట్ హోటల్ మస్కట్. ఈ ప్రాజెక్టులు ఆర్థిక వైవిధ్యాన్ని పెంపొందించడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రారంభించబోయే ప్రాజెక్టుల మొత్తం వ్యయం OMR4.65 బిలియన్లు అని ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









