104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు..
- May 28, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని పలు పట్టణాల్లో శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక, ఇతర దాడుల్లో 104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్య పై స్పష్టత లేదని పేర్కొన్నారు. మొదటగా టర్కీ స్థానిక మీడియాలో ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో టర్కీ అధికారులు శుక్రవారం రాత్రి నిర్వహించిన దాడుల ఆపరేషన్ పై స్పందించారు.అమెరికాతో పాటు తమ సేనలు యుద్ధవిమానాల ద్వారా, వైమానిక, భూభాగ విభాగాల సైన్యం బాంబు దాడులు, కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. ఉగ్రకార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా వినియోగిస్తు ఏడు పెద్ద భవంతులను ధ్వంసం చేశారు. ఇటీవల సిరియా సరిహద్దు ప్రాంతాల్లోనూ 21 మంది చనిపోవడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









