డస్కీ బ్యూటీ నిశ్చితార్ధం చేసుకుంది..
- May 28, 2016
డస్కీ బ్యూటీ ప్రియమణి నిశ్చితార్ధం చేసుకుంది. అవకాశాలు తగ్గిపోవడంతో ఇక లైఫ్ లో సెటిల్ అవుదామని నిర్ణయించకున్న ప్రియమణి, గత కొంతకాలంగా తను లవ్ చేస్తున్న ముస్తఫా రాజ్ తో నిశ్చితార్ధ వేడుకను జరుపుకుంది. బెంగుళూరులోని బనశంకరిలో, కుటుంబసభ్యుల మధ్య, చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అయిన ముస్తఫాతో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. చాలా కాలం క్రితమే, తాను ముస్తఫారాజ్ ప్రేమించుకుంటున్నామని ప్రియమణి చెప్పేసింది. అయితే ఆమె అలా చెప్పేయడమే కెరీర్ కు దెబ్బ కొట్టింది. సడెన్ గా పెళ్లి చేసుకుంటే, తమ సినిమాలకు ఇబ్బందవుతుందని భావించిన దర్శక నిర్మాతలు, ప్రియమణిని పక్కన పెట్టేశారు. దాంతో గత కొంత కాలంగా అరకొర సినిమాలతోనే నెట్టుకొచ్చింది. తెలుగులో యమదొంగ, రగడ, వాంటెడ్ లాంటి సినిమాల్లో నటించిన ప్రియమణికి తమిళంలో చేసిన పరుత్తి వీరన్ సినిమాతో జాతీయ పురస్కారం లభించింది. ఇక పెళ్లి విషయానికొస్తే, చాలా నిరాడంబరంగా కేవలం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని ప్రకటించింది. తమ ప్రేమకు రెండు వైపులా పెద్దలు అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతానని అంటోందీ డస్కీ బ్యూటీ.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









