హజ్-2024: విదేశీ యాత్రికుల నమోదు ప్రారంభం
- December 26, 2023
జెడ్డా: హజ్ 2024 కోసం విదేశీ యాత్రికుల అధికారిక నమోదును ప్రారంభించినట్లు సౌదీ అరేబియా సోమవారం ప్రకటించింది. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం యాత్రికులు ఇప్పుడు హజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నుసుక్ హజ్ అప్లికేషన్ ద్వారా హజ్ 1445/2024 కోసం తమ కుటుంబాలతో సహా నమోదు చేసుకోవచ్చు.” అని మినిస్ట్రీ ఆఫ్ మీడియా ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ (CIC) వెల్లడించింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు ఓషియానియా ఖండాల నుండి యాత్రికులు నుసుక్ హజ్ అప్లికేషన్ ద్వారా తీర్థయాత్ర కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ గురించిన మరిన్ని వివరాలను hajj.nusuk.sa వెబ్సైట్ నుండి పొందవచ్చు.
మహమ్మారి అనంతర కాలంలో 2023లో మొదటి పూర్తి సామర్థ్యం గల హజ్ తీర్థయాత్రను నిర్వహించారు. 1,660,915 మంది విదేశీ యాత్రికులు, 184,130 మంది స్వదేశీ యాత్రికులు సహా మొత్తం 1,845,045 మంది యాత్రికులు గత హజ్ చేశారు. వారిలో మేల్ యాత్రికుల సంఖ్య 969,694 కాగా, మహిళా యాత్రికుల సంఖ్య 875,351. ఆసియా దేశాల నుండి మొత్తం 1,056,317 మంది(63.5 శాతం) యాత్రికులు వచ్చారు. అరబ్ దేశాల నుండి వచ్చిన యాత్రికుల సంఖ్య 346,214 గా ఉంది. మొత్తం యాత్రికులలో వీరిది 21 శాతం.
తాజా వార్తలు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్







