ఇరాక్ ఎడారిలో ఇద్దరు కువైటీల కిడ్నాప్
- December 26, 2023
కువైట్: ఇరాక్లోని ఎడారి ప్రాంతంలో వేటకు వెళ్లి కిడ్నాప్కు గురైన ఇద్దరు కువైటీల కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయని అధికారులు సోమవారం తెలిపారు. అన్బర్ మరియు సలావుద్దీన్ ప్రావిన్సుల మధ్య ఎడారి ప్రాంతంలో ఆదివారం కిడ్నాప్ జరిగినట్లు పోలీసు కల్నల్ వెల్లడించారు. అయితే, ఇరాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కువైట్ జాతీయుడి కిడ్నాప్ మాత్రమే జరిగిందని ప్రకటించింది. ఇదే విషయంపై కువైట్ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్తో ఇరాక్ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్ మాట్లాడారు. కువైటీలు ప్రయాణిస్తున్న వాహనంనూ కొందరు ముష్కరులు దాడి చేశారని, అనంతరం ఇద్దరు కువైట్లతో సంబంధాలు తెగిపోయాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







