ఇరాక్ ఎడారిలో ఇద్దరు కువైటీల కిడ్నాప్

- December 26, 2023 , by Maagulf
ఇరాక్ ఎడారిలో ఇద్దరు కువైటీల కిడ్నాప్

కువైట్: ఇరాక్‌లోని ఎడారి ప్రాంతంలో వేటకు వెళ్లి కిడ్నాప్‌కు గురైన ఇద్దరు కువైటీల కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయని అధికారులు సోమవారం తెలిపారు. అన్బర్ మరియు సలావుద్దీన్ ప్రావిన్సుల మధ్య ఎడారి ప్రాంతంలో ఆదివారం కిడ్నాప్ జరిగినట్లు పోలీసు కల్నల్ వెల్లడించారు. అయితే, ఇరాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కువైట్ జాతీయుడి కిడ్నాప్ మాత్రమే జరిగిందని ప్రకటించింది. ఇదే విషయంపై కువైట్ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్‌తో ఇరాక్ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్ మాట్లాడారు. కువైటీలు ప్రయాణిస్తున్న వాహనంనూ కొందరు ముష్కరులు దాడి చేశారని, అనంతరం ఇద్దరు కువైట్‌లతో సంబంధాలు తెగిపోయాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com