ఎమిరాటీ జంటను పరామర్శించిన ఆర్టీఏ అధికారులు
- December 26, 2023
దుబాయ్: డిసెంబర్ 21న జరిగిన ఘోరమైన ప్రేగ్ మాస్ షూటింగ్ లో గాయపడిన ఎమిరాటీ దంపతులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధి బృందం పరామర్శించింది. దంపతులిద్దరూ యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. భర్త అహ్మద్ ఇబ్రహీం ఒబైద్ అలీ అల్ అలీ ఉమ్ అల్ క్వైన్ మునిసిపాలిటీకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. భార్య రౌదా అల్ మెహ్రిజీ దుబాయ్లోని ఆర్టీఏలో మార్కెటింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఈమేరకు వారిని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దంపతుల ఆరోగ్యాన్ని, అలాగే వారి ఇద్దరు కుమార్తెలు మరియం మరియు లతీఫా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దంపతులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. వారు సురక్షితంగా యూఏఈకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 21న ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఆయుధాలు ధరించిన 24 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!