ఎమిరాటీ జంటను పరామర్శించిన ఆర్టీఏ అధికారులు

- December 26, 2023 , by Maagulf
ఎమిరాటీ జంటను పరామర్శించిన ఆర్టీఏ అధికారులు

దుబాయ్: డిసెంబర్ 21న జరిగిన ఘోరమైన ప్రేగ్ మాస్ షూటింగ్ లో గాయపడిన ఎమిరాటీ దంపతులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రతినిధి బృందం పరామర్శించింది. దంపతులిద్దరూ యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. భర్త అహ్మద్ ఇబ్రహీం ఒబైద్ అలీ అల్ అలీ  ఉమ్ అల్ క్వైన్ మునిసిపాలిటీకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. భార్య రౌదా అల్ మెహ్రిజీ దుబాయ్‌లోని ఆర్టీఏలో మార్కెటింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు.  ఈమేరకు వారిని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దంపతుల ఆరోగ్యాన్ని, అలాగే వారి ఇద్దరు కుమార్తెలు మరియం మరియు లతీఫా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దంపతులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. వారు సురక్షితంగా యూఏఈకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 21న ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆయుధాలు ధరించిన 24 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com