ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్రెడ్డి భేటీ..
- December 26, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మోదీని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను అడిగామనన్నారు.
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా మోదీని కలిశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెచ్చుకున్నామని అన్నారు. ఈ మూడు విషయాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కారు నిధులు తీసుకురాలేకపోయిందని భట్టి విక్రమార్క అన్నారు. తాము విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు.
అలాగే, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి విజ్ఞప్తులు చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని అన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!