తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి
- December 31, 2023
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ.సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత వారమే ప్రభుత్వం ఈయన పేరును సూచిస్తూ ఆమోదం కోరకు గవర్నర్ కార్యాలయానికి పంపింది. అయితే గవర్నర్ బిజీగా ఉండటం వల్ల ఆమోదానికి కాస్త సమయం పట్టింది. గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఏజీ నియమకానికి సంబంధించి జీవో 636ను విడుదల చేసింది.
పదేండ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏజీ పదవి కోసం చాలా మంది సీనియర్ న్యాయవాదుల పేర్లు వినిపించాయి. అయనప్పటికి, ప్రభుత్వం గతంలో ఏజీగా పని చేసిన సుదర్శన్ రెడ్డి వైపే మగ్గు చూపింది. 2011లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి హైకోర్టులో సుదర్శన్ రెడ్డి ఏజీగా విధులు నిర్వహించారు. అడ్వకేట్ జనరల్ పదవీ చేపట్టిన తొలి తెలంగాణ న్యాయవాది సుదర్శన్ రెడ్డి కావడం విశేషం. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే నాటికి ఏజీగా ఉన్న సుదర్శన్ రెడ్డి మళ్లీ ఏజీ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







