తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి
- December 31, 2023
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ.సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత వారమే ప్రభుత్వం ఈయన పేరును సూచిస్తూ ఆమోదం కోరకు గవర్నర్ కార్యాలయానికి పంపింది. అయితే గవర్నర్ బిజీగా ఉండటం వల్ల ఆమోదానికి కాస్త సమయం పట్టింది. గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఏజీ నియమకానికి సంబంధించి జీవో 636ను విడుదల చేసింది.
పదేండ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏజీ పదవి కోసం చాలా మంది సీనియర్ న్యాయవాదుల పేర్లు వినిపించాయి. అయనప్పటికి, ప్రభుత్వం గతంలో ఏజీగా పని చేసిన సుదర్శన్ రెడ్డి వైపే మగ్గు చూపింది. 2011లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి హైకోర్టులో సుదర్శన్ రెడ్డి ఏజీగా విధులు నిర్వహించారు. అడ్వకేట్ జనరల్ పదవీ చేపట్టిన తొలి తెలంగాణ న్యాయవాది సుదర్శన్ రెడ్డి కావడం విశేషం. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే నాటికి ఏజీగా ఉన్న సుదర్శన్ రెడ్డి మళ్లీ ఏజీ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







