ఇస్రో మరో ఘనత.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్..
- January 06, 2024
బెంగుళూరు: సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. 125 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 సూర్యుడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి థ్రస్టర్లను మండించి హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్ ఇక్కడి నుంచే సూర్యుడిని నిరంతరం పర్యవేక్షిస్తుంది.
కాగా.. ఈ ప్రయోగం విజయం కావడం పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు. ‘భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్రసాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే ప్రయాణం కొనసాగుతోంది.’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







