కోస్టల్ టూరిజం లైసెన్సింగ్.. సౌదీ రెడ్ సీ అథారిటీ తనిఖీలు ప్రారంభం
- January 07, 2024
జెడ్డా : కోస్టల్ టూరిజం కార్యకలాపాలకు లైసెన్స్లు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సౌదీ ఎర్ర సముద్ర అథారిటీ (SRSA) తనిఖీలను ప్రారంభించింది. ఈ తనిఖీలు జెడ్డా, జజాన్ మరియు అల్ లైత్లలో ప్రారంభమయ్యాయి. ఇది మెరీనా ఆపరేటర్లు, సముద్ర పర్యాటక ఏజెంట్లకు లైసెన్సు ఇవ్వడంలో కీలకమైన దశను సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాలతో తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీ తెలిపింది. టూరిస్ట్ మెరీనా ఆపరేటర్ల లైసెన్సింగ్ మెరీనా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, కస్టమర్ సేవా ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు ఎర్ర సముద్ర తీరం వెంబడి పడవలు, సందర్శకులకు భద్రతను నిర్ధారిస్తుంది. దీనితోపాటు సముద్ర టూరిజం ఏజెంట్ల లైసెన్సింగ్ యాచ్లు, క్రూయిజ్లకు అత్యుత్తమ సేవలను అందించడానికి వారికి అధికారం కల్పిస్తుంది. కొత్త కోస్టల్ టూరిజం లైసెన్సుల విధానం సౌదీ అరేబియా తీర ప్రాంత పర్యాటక అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక, వినూత్నమైన దశగా పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







