రమదాన్ సందర్భంగా ధరలపై నిఘా
- June 01, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అధికార ప్రతినిథి, రమదాన్ సందర్భంగా అలాగే మిగతా రోజుల్లో ధరలపై నిఘా కొనసాగుతుందని చెప్పారు. నిర్ధారిత మార్కెట్ రేట్లను మించి ఎక్కువ ధరకు ఫుడ్ స్టఫ్ సహా ఇతర వస్తువుల ధరలు ఉంటే ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ వర్గాలు హెచ్చరించాయి. ఆయిల్, బ్రెడ్, ఫ్లోర్, షుగర్, చికెన్, మీట్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ వంటివాటిపై నిఘా కొనసాగుతుంది గనుక, రిటైలర్స్ అమ్మకాలపై జాగ్రత్తగా ఉండాలని కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నౌమి చెప్పారు. వినియోగదారులకు ధరల విషయంలో ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించాలని చెప్పారు. 8001222 నంబర్కి ఫోన్ చేసి, ధరలపై ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. మినిస్ట్రీకి సంబంధించిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ కాల్ సెంటర్ని 600522225లోనూ సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్లు మరియు ట్యాబ్లెట్లు, అలాగే రీ కాల్ సర్వీస్ల ద్వారా వినియోగదారుల హక్కుల్ని పరిరక్షించేందుకు మంత్రి వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







