మనామాలో 18వ స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్..వారానికో థీమ్
- February 03, 2024
బహ్రెయిన్: 18వ స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్లో భాగంగా మనామా పోస్ట్ ఆఫీస్లో "ఫ్రమ్ ద పోస్ట్" సాంస్కృతిక కార్యకలాపాలు తిరిగి వస్తోంది. ఫిబ్రవరి నెలంతా ప్రతి శనివారం వైవిధ్యభరితమైన ఈవెంట్లకు కేంద్రంగా మారనుంది. ఈ ప్రత్యేకమైన అనుభవం సంస్కృతి మరియు చరిత్రను ఒకేచోటకు తీసుకురానుంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) సహకారంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ మనామా యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వంతో ప్రజల అనుబంధాన్ని మరింతగా పెంచడం ఈ కార్యాచరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పురాతన నగరం యొక్క చరిత్ర, మార్కెట్లు, పురాతన గ్రామాలు, కళలు మరియు వాస్తుశిల్పంపై ఫోకస్ చేయనుంది. ప్రతి శనివారం "ఆర్కిటెక్చరల్ హెరిటేజ్" పేరుతో నిర్వహించే వేడుకలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. మొదటివారం “టెక్స్టైల్: ట్రేడ్ ఇన్ మనామా” థీమ్ తో నిర్వహిస్తున్నారు. టూర్ రిజిస్ట్రేషన్లు, మరింత సమాచారం కోసం www.culture.gov.bh వెబ్సైట్ను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!







