అబుధాబిలో భారత ప్రధానిని కలవడానికి 60వేల మంది రిజిస్టర్
- February 03, 2024
యూఏఈ: ఫిబ్రవరి 13న అబుధాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న కమ్యూనిటీ ఈవెంట్ ‘అహ్లాన్ మోదీ’కి హాజరయ్యేందుకు 60,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భారత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మెగా కమ్యూనిటీ ఈవెంట్.. అబుదాబిలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించటానికి ఒక రోజు ముందు నిర్వహిస్తున్నారు. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారతీయ కళల వైవిధ్యాన్ని ప్రదర్శించే 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ పాఠశాల విద్యార్థులు, భారత కమ్యూనిటీ సభ్యులు నిర్వాహకులు తెలిపారు. "అహ్లాన్ మోడీ కేవలం ఒక కార్యక్రమం కాదు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన వేడుక. సరిహద్దుల్లో ప్రతిధ్వనిస్తుంది." అని శోభా రియాల్టీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ పీఎన్ఎస్ మీనన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









