అబుధాబిలో భారత ప్రధానిని కలవడానికి 60వేల మంది రిజిస్టర్
- February 03, 2024
యూఏఈ: ఫిబ్రవరి 13న అబుధాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న కమ్యూనిటీ ఈవెంట్ ‘అహ్లాన్ మోదీ’కి హాజరయ్యేందుకు 60,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భారత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మెగా కమ్యూనిటీ ఈవెంట్.. అబుదాబిలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించటానికి ఒక రోజు ముందు నిర్వహిస్తున్నారు. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారతీయ కళల వైవిధ్యాన్ని ప్రదర్శించే 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ పాఠశాల విద్యార్థులు, భారత కమ్యూనిటీ సభ్యులు నిర్వాహకులు తెలిపారు. "అహ్లాన్ మోడీ కేవలం ఒక కార్యక్రమం కాదు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన వేడుక. సరిహద్దుల్లో ప్రతిధ్వనిస్తుంది." అని శోభా రియాల్టీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ పీఎన్ఎస్ మీనన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







