మైగ్రేన్ నుంచి ఉపశమనానికి ఇంటి చిట్కాలు.!
- February 18, 2024
తలనొప్పి యందు మైగ్రేన్ తలనొప్పి వేరయా.! అనొచ్చేమో. అంతలా దీని బాధ వేదిస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కూడా పొందలేము.
అలాంటి పరిస్థితుల్లోనే కొన్ని ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ నుంచి తప్పించుకోవడానికి కొందరయితే, పండు మిర్చితో తలపై పట్టులా వేసుకుంటారు. మిర్చి చిన్న ముక్క తగిలితేనే ముఖంపై సున్నితమైన చర్మం మండిపోతుంది. అలాంటిది, మిర్చి పట్టు.. అంటే ఆ మంట ఏ స్థాయిలో వుంటుంది.
కానీ, మైగ్రేన్ బాధితులకి పండు మిర్చి మంట కన్నా.. మైగ్రేన్ తలనొప్పి బాధే ఎక్కువ అని ప్రాక్టికల్గా కొన్ని సర్వేల్లో తేలింది. అయితే, కొందరు ఐస్ ముక్కలు పెట్టి తాత్కాలిక ఉపశమనం పొందుతారు.
అలాగే, ఆవాలతో పట్టు వేస్తే కాస్త ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆవాలను ముద్దలా నూరి నుదుటిపై మైగ్రేన్ వున్న వైపు పూతలా పూసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
అలాగే, టీ, కాఫీల జోలికి పోకూడదు మైగ్రేన్ బాధితులు. వాటి స్థానంలో కొత్తిమీర కలిపిన గ్రీన్ టీ తీసుకుంటే ఉపశమనం వుంటుంది. అలాగే చల్లని పానీయాల జోలికి కూడా పోకూడదు. చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. గాలి వెలుతురు సక్రమంగా తగిలే వాతావరణంలో వుండాలి. డి విటమిన్ తగిలేలా ఉదయం, సాయంత్రం ఎండకు కాస్త ఎక్స్పోజ్ అవ్వాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







