మైగ్రేన్ నుంచి ఉపశమనానికి ఇంటి చిట్కాలు.!
- February 18, 2024తలనొప్పి యందు మైగ్రేన్ తలనొప్పి వేరయా.! అనొచ్చేమో. అంతలా దీని బాధ వేదిస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కూడా పొందలేము.
అలాంటి పరిస్థితుల్లోనే కొన్ని ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ నుంచి తప్పించుకోవడానికి కొందరయితే, పండు మిర్చితో తలపై పట్టులా వేసుకుంటారు. మిర్చి చిన్న ముక్క తగిలితేనే ముఖంపై సున్నితమైన చర్మం మండిపోతుంది. అలాంటిది, మిర్చి పట్టు.. అంటే ఆ మంట ఏ స్థాయిలో వుంటుంది.
కానీ, మైగ్రేన్ బాధితులకి పండు మిర్చి మంట కన్నా.. మైగ్రేన్ తలనొప్పి బాధే ఎక్కువ అని ప్రాక్టికల్గా కొన్ని సర్వేల్లో తేలింది. అయితే, కొందరు ఐస్ ముక్కలు పెట్టి తాత్కాలిక ఉపశమనం పొందుతారు.
అలాగే, ఆవాలతో పట్టు వేస్తే కాస్త ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆవాలను ముద్దలా నూరి నుదుటిపై మైగ్రేన్ వున్న వైపు పూతలా పూసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
అలాగే, టీ, కాఫీల జోలికి పోకూడదు మైగ్రేన్ బాధితులు. వాటి స్థానంలో కొత్తిమీర కలిపిన గ్రీన్ టీ తీసుకుంటే ఉపశమనం వుంటుంది. అలాగే చల్లని పానీయాల జోలికి కూడా పోకూడదు. చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. గాలి వెలుతురు సక్రమంగా తగిలే వాతావరణంలో వుండాలి. డి విటమిన్ తగిలేలా ఉదయం, సాయంత్రం ఎండకు కాస్త ఎక్స్పోజ్ అవ్వాలి.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…