మైగ్రేన్ నుంచి ఉపశమనానికి ఇంటి చిట్కాలు.!
- February 18, 2024
తలనొప్పి యందు మైగ్రేన్ తలనొప్పి వేరయా.! అనొచ్చేమో. అంతలా దీని బాధ వేదిస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కూడా పొందలేము.
అలాంటి పరిస్థితుల్లోనే కొన్ని ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ నుంచి తప్పించుకోవడానికి కొందరయితే, పండు మిర్చితో తలపై పట్టులా వేసుకుంటారు. మిర్చి చిన్న ముక్క తగిలితేనే ముఖంపై సున్నితమైన చర్మం మండిపోతుంది. అలాంటిది, మిర్చి పట్టు.. అంటే ఆ మంట ఏ స్థాయిలో వుంటుంది.
కానీ, మైగ్రేన్ బాధితులకి పండు మిర్చి మంట కన్నా.. మైగ్రేన్ తలనొప్పి బాధే ఎక్కువ అని ప్రాక్టికల్గా కొన్ని సర్వేల్లో తేలింది. అయితే, కొందరు ఐస్ ముక్కలు పెట్టి తాత్కాలిక ఉపశమనం పొందుతారు.
అలాగే, ఆవాలతో పట్టు వేస్తే కాస్త ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆవాలను ముద్దలా నూరి నుదుటిపై మైగ్రేన్ వున్న వైపు పూతలా పూసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
అలాగే, టీ, కాఫీల జోలికి పోకూడదు మైగ్రేన్ బాధితులు. వాటి స్థానంలో కొత్తిమీర కలిపిన గ్రీన్ టీ తీసుకుంటే ఉపశమనం వుంటుంది. అలాగే చల్లని పానీయాల జోలికి కూడా పోకూడదు. చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. గాలి వెలుతురు సక్రమంగా తగిలే వాతావరణంలో వుండాలి. డి విటమిన్ తగిలేలా ఉదయం, సాయంత్రం ఎండకు కాస్త ఎక్స్పోజ్ అవ్వాలి.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







