దాడికి కుట్ర.!!
- June 04, 2016
ఈ ఏడాది జరగనున్న అమర్నాథ్ యాత్రపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ కెకె. శర్మ వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తులపై దాడులు జరపడానికి మిలిటెంట్లు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు హాజరయ్యే భక్తుల భద్రతకై తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. నిన్న బీఎస్ఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేస్తారని వూహించలేదన్నారు.
ఈ దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో మృతి చెందిన జవాన్లకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









