స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్
- June 30, 2015
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ త్రీవవాదులు అనుమానం పెంచుకున్నారు. ఆదివారం ఒక మహిళను, ఆమె భర్తను, సోమవారం ఇంకొక మహిళ ఆమె భర్తను పట్టుకుని తలలు నరికి వేశారు. అందరూ చూస్తున్న సమయంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు బహిరంగ ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డారని సిరియా మానవహక్కుల పరిశీలన సంఘం వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజోర్ రాష్ట్రంలో మహిళలు, వారి భర్తల తలలు నరికి వేశారని మానవ హక్కుల సంఘం చీఫ్ రమీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తు గతంలో బహిరంగ ప్రాంతాలలో మహిళలను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే మహిళల తలలు నరకడం ఇదే మొదటి సారి అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు అంటున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరాక్, సిరియాలో 3,000 మందికి పైగా స్థానికులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చంపేశారు. అందులో మహిళలు 1,800 మంది, 74 మంది పిల్లలు ఉన్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రోజుకు ఒక విధంగా సామాన్యులను అంతం చేసి వారి పైచాచికాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









