ఉమ్రా, హజ్ యాత్రికుల కోసం ఇన్ఫ్లుఎంజా జాబ్ తప్పనిసరా?
- March 27, 2024
యూఏఈ: యాత్రికులకు తప్పనిసరి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సినేషన్ను ప్రకటించిన తర్వాత ఉమ్రా మరియు హజ్ టూర్ ఆపరేటర్లు, నివాసితులు స్పష్టం కోసం నిరీక్షిస్తున్నారు. సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్ఫ్లుఎంజా వ్యాక్సినేషన్ కార్డ్లను సమర్పించాలని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) తెలిపింది. ఈ నిబంధనల మార్చి 26 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంది. హజ్ మరియు ఉమ్రా పర్యటనలను నిర్వహించే అల్హింద్ బిజినెస్ సెంటర్ నుండి నౌషాద్ హసన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ విషయంపై మాకు ఎటువంటి స్పష్టత రాలేదన్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం నాటికి మా ప్రయాణీకులెవరూ టీకా కార్డులు లేదా అలాంటి డాక్యుమెంటేషన్ కోసం అడగలేదని పేర్కొన్నారు. అయితే, నవీదా జుకాకు మార్చి 31న ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు వెళ్లాల్సి ఉందని, తమ ట్రావెల్ ఏజెంట్ లేదా ఎయిర్లైన్స్ నాకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని పలువురు నివాసితులు, పౌరులు తెలిపారు. మరోవైపు గతంలో ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ను గత సంవత్సరంలో పొందిన వ్యక్తులు కొత్త టీకాను పొందడం నుండి మినహాయించారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆమోదించబడిన టీకా కార్డులను అల్ హోస్న్ అప్లికేషన్ ద్వారా పొందవచ్చని, ప్రయాణ తనిఖీ కేంద్రాల వద్ద సమర్పించవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







