విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- March 28, 2024మస్కట్: విదేశీ పెట్టుబడిదారులు ఒమన్లో తమ వాణిజ్య కార్యకలాపాలలో కనీసం ఒక ఒమానీ పౌరుడిని నియమించాలని మంత్రుల మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ నియంత్రణ, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో మరింత సమగ్రమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖలోని ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అమ్మర్ బిన్ సులైమాన్ అల్ ఖరౌసీ వెల్లడించారు. కొత్త నియంత్రణ ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఒమన్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఒక సంవత్సరంలోపు ఒమన్ పౌరుడిని నియమించుకోవాలి.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్