సందీప్ రెడ్డి వంగా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.?
- April 15, 2024‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాకే బాలీవుడ్లో అడుగు పెట్టేశాడు. అదే సినిమాని అక్కడ కూడా రీమేక్ చేసి అక్కడా సంచలనాలు సృస్టించాడు.
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ల లిస్టులో సందీప్ రెడ్డి వంగా పేరు కూడా చేరిపోయింది. లేటెస్ట్ మూవీ ‘యానిమల్’ డైరెక్టర్గా ఆయన క్రేజ్ని మరింత పెంచేసింది.
ఇక, ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే చిత్రం ‘స్పిరిట్’. యూనివర్సల్ హీరో ప్రబాస్తో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా ఇప్పటి నుంచే క్రేజీ టాక్లో నిలుస్తోంది. అంతేకాదు, సినిమాని పట్టాలెక్కించకుండానే ప్రమోషన్లు కూడా మొదలెట్టేశాడు సందీప్ రెడ్డి వంగా.
ఈ సినిమా గురించి అంత కాదు, ఇంత కాదు.. అంటూ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి ఇంటర్వ్యూలిస్తున్నాడు కూడా. అలాగే, సోషల్ మీడియాలోనూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాడు.
పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు నెటిజన్లతో ఈ సందర్భంగా. తాజాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటన్న ప్రశ్న తలెత్తింది. మైఖేల్ జాక్సన్ బయోపిక్ని తెరకెక్కించాలన్నది తన డ్రీమ్.. అనీ, అందుకు తగ్గ స్టోరీ, హీరో కోసం వెయిటింగ్.. అనీ అన్నీ సెట్ అయితే ఖచ్చితంగా ఆ బయోపిక్ తెరకెక్కిస్తా.. అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!