పెరిగిన పసిడి ధర

- June 09, 2016 , by Maagulf
పెరిగిన పసిడి ధర

బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. రూ.10 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,170కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారులు కొనుగోళ్లకు దిగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.55శాతం పెరిగి 1,262.50 డాలర్లకు చేరింది.
వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. మళ్లీ రూ.40వేల మార్కును చేరుకుంది. ఈ ఒక్కరోజే రూ.1000 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లుకు మొగ్గు చూపడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 17.01 యూఎస్‌ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com