ఈ రెమిడీస్తో మధుమేహాన్ని కంట్రోల్లో వుంచుకోవచ్చు.!
- May 22, 2024
మధుమేహం (డయాబెటిస్) ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు.. ఇక జీవితాంతం మందులకు పరిమితం కావల్సిందే. అంతేకాదు, ఆహార నియమాల్లోనూ కొన్ని నియంత్రణలు తప్పని సరి.
వీటితో పాటూ, అనేక రకాల అనారోగ్య సమస్యలు మధుమేహుల్ని వేధిస్తుంటాయ్. అయితే, ప్రతీరోజూ తీసుకునే మందులతో పాటూ, మధుమేహం వున్న వాళ్లు కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రణలో వుంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగానూ వుండొచ్చు.
కొన్ని చిన్న చిన్న యోగాసనాల ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. వాటిలో ముఖ్యమైనవి ప్రాణాయామం, శవాసనం. ఈ ఆసనాలను ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల ప్లీహ గ్రంధి, పిట్యూటరీ గ్రంధి చక్కెర స్థాయిల్ని సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయ్.
ఈ ఆసనాల్లో ధ్యానం, శ్వాస పధ్దతులు అనుసరించడం వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే, క్రమం తప్పకుండా మధుమేహం వున్నవారు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









