షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్న భారత రాయబారి సంజయ్ సుధీర్
- May 23, 2024
యూఏఈ: మే 21న అబుదాబిలో జరిగిన 5వ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ (MFAEA)లో యూఏఈ విదేశాంగ మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుండి భారత రాయబారి సంజయ్ సుధీర్ షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. అలాగే, H.E. దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ కూడా షీల్డ్ను అందుకున్నారు. అవార్డులలో రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల విభాగంలో అవార్డులు అందుకున్న ఏకైక దేశంగా ఇండియా నిలిచింది. MFAEA అవార్డులు రావడం భారతదేశం-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంబసీ మరియు కాన్సులేట్ కృషికి గుర్తింపును ఇచ్చింది. ఇది యూఏఈలోని భారతీయ ప్రవాసుల సంక్షేమం పట్ల ఎంబసీ, కాన్సులేట్ నిబద్ధతను కూడా మరోసారి చాటి చెప్పిందని అధికారులు స్పష్టం చేశారు.

తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









