షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్న భారత రాయబారి సంజయ్ సుధీర్
- May 23, 2024
యూఏఈ: మే 21న అబుదాబిలో జరిగిన 5వ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ (MFAEA)లో యూఏఈ విదేశాంగ మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుండి భారత రాయబారి సంజయ్ సుధీర్ షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. అలాగే, H.E. దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ కూడా షీల్డ్ను అందుకున్నారు. అవార్డులలో రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల విభాగంలో అవార్డులు అందుకున్న ఏకైక దేశంగా ఇండియా నిలిచింది. MFAEA అవార్డులు రావడం భారతదేశం-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంబసీ మరియు కాన్సులేట్ కృషికి గుర్తింపును ఇచ్చింది. ఇది యూఏఈలోని భారతీయ ప్రవాసుల సంక్షేమం పట్ల ఎంబసీ, కాన్సులేట్ నిబద్ధతను కూడా మరోసారి చాటి చెప్పిందని అధికారులు స్పష్టం చేశారు.

తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







