షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్న భారత రాయబారి సంజయ్ సుధీర్
- May 23, 2024
యూఏఈ: మే 21న అబుదాబిలో జరిగిన 5వ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ (MFAEA)లో యూఏఈ విదేశాంగ మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుండి భారత రాయబారి సంజయ్ సుధీర్ షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. అలాగే, H.E. దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ కూడా షీల్డ్ను అందుకున్నారు. అవార్డులలో రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల విభాగంలో అవార్డులు అందుకున్న ఏకైక దేశంగా ఇండియా నిలిచింది. MFAEA అవార్డులు రావడం భారతదేశం-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంబసీ మరియు కాన్సులేట్ కృషికి గుర్తింపును ఇచ్చింది. ఇది యూఏఈలోని భారతీయ ప్రవాసుల సంక్షేమం పట్ల ఎంబసీ, కాన్సులేట్ నిబద్ధతను కూడా మరోసారి చాటి చెప్పిందని అధికారులు స్పష్టం చేశారు.

తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







