రజనీకాంత్కు గోల్డెన్ వీసా..
- May 24, 2024
అబుధాబి: యూఏఈ గోల్డెన్ వీసా ను అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా రజనీకాంత్ చేరారు.వీసా పొందిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాన్నో గౌరవంగా భావిస్తున్నానన్నారు. యూఏఈ ప్రభుత్వానికి, తన స్నేహితుడు, లులూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుక్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్లాల్, మమ్ముట్టి, టొవినో థామస్,సిరాశ్రీ తదితరులకు ఈ వీసా లభించింది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







