రజనీకాంత్కు గోల్డెన్ వీసా..
- May 24, 2024అబుధాబి: యూఏఈ గోల్డెన్ వీసా ను అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా రజనీకాంత్ చేరారు.వీసా పొందిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాన్నో గౌరవంగా భావిస్తున్నానన్నారు. యూఏఈ ప్రభుత్వానికి, తన స్నేహితుడు, లులూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుక్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్లాల్, మమ్ముట్టి, టొవినో థామస్,సిరాశ్రీ తదితరులకు ఈ వీసా లభించింది.
తాజా వార్తలు
- మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..
- యూఏఈలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఈ ఏడాది హజ్ చేసిన 1.83 మిలియన్ల మంది యాత్రికులు
- G7 సమ్మిట్.. UK ప్రధానిని కలిసిన యూఏఈ అధ్యక్షుడు
- మంగాఫ్ అగ్నిప్రమాదం..బాధిత కుటుంబాలకు 4 ఏళ్ల వరకు జీతం
- ఒమన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో స్మార్ట్ మొబిలిటీ సర్వీస్ ట్రయల్ ప్రారంభం
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ఇవే
- ఈద్ అల్ అదా..1,138 మంది ఖైదీల విడుదల
- మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్
- విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి