బెంగళూరు రేవ్ పార్టీ కేసు..నటి హేమ కీలక వ్యాఖ్యలు
- May 23, 2024
హైదరాబాద్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ టెస్ట్లో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు పంపారు. అయితే ఘటనపై హేమ తాజాగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏం చేస్తారో చేసుకోండి.. సమయం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ మీడియాతో చెప్పుకోచ్చింది.
మరోవైపు ఈ పార్టీకి వచ్చిన హేమ తన అసలు పేరును కృష్ణవేణిగా నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయ్యాకే హేమగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









