ఛోటా రాజన్ ను హత్య చేసేందుకు దావూద్ ఇబ్రహీం అనుచరుడు ..
- June 10, 2016తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్ ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్ ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు పథకం పన్నినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.ఛోటా షకీల్ తో నిందితులు ఫోన్ సంభాషణలు సాగించినట్టు గుర్తించామని, అనంతరం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు స్పెషల్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) అరవింద్ దీప్ చెప్పారు. జూన్ 3వ తేదీన వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 5 రోజులు పోలీసుల రిమాండ్ కు అప్పగించారు.
విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీకి అదేశించినట్టు అరవింద్ దీప్ చెప్పారు. ఓ నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్ లో ఇండోనేసియాలో అరెస్ట్ అయిన ఛోటా రాజన్ ను భారత్ కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!